Sunday, April 28, 2024

AP: ష‌ర్మిల టైమ్ పాస్ నాయ‌కురాలు – మంత్రి రోజా

న‌గ‌రి – ఏపీలో టైమ్ పాస్ రాజకీయాలు చేయడానికి వచ్చిందంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ లను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని… అందుకే జనసేనాని పవన్ కల్యాణ్ ను వీరు రంగంలోకి దించారని చెప్పారు. న‌గ‌రిలో ఆమె నేడు మీడియాతో మాట్లాడుతూ… ఇప్పడు పవన్ కల్యాణ్ మాటలు కూడా వివి విని బోర్ కొట్టడంతో షర్మిలను రంగంలోకి దించారని ఎద్దేవా చేశారు. షర్మిల మాట్లాడుతున్న ప్రతి మాట కూడా చంద్రబాబు స్క్రిప్టేనని అన్నారు.

చంద్రబాబుకు షర్మిల తన కొడుకు పెళ్లి కార్డు ఇచ్చార‌ని, .. వైఎస్సార్ ను పంచలూడదీసి కొడతానన్న పవన్ ఇంటికి కూడా వెళ్లి వెడ్డింగ్ కార్డు అంద‌జేశార‌ని రోజా విమర్శించారు. చంద్రబాబు కోవర్ట్ రేవంత్ రెడ్డితో షర్మిల పొత్తు పెట్టుకుందని ఆరోపించారు… వైఎస్సార్ కూతురు అనే గుర్తింపు తప్ప షర్మిలకు మరే గుర్తింపు లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఏది చేసినా దాని వెనుక వ్యక్తిగత స్వార్థం ఉంటుందని రోజా విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం గతంలో కాంగ్రెస్ తో ఇప్పుడు జనసేన, బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement