Sunday, May 5, 2024

Phonepe : తేరస్‌, దీపావళి సీజన్‌ కు 24కే డిజిటల్‌ గోల్ట్‌ పై ఫోన్‌ పే క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు

హైదరాబాద్ : దంతేరస్‌ (ధన త్రయోదశి), దీపావళి 2023 పండుగ సీజన్‌ను పురస్కరించుకుని, 24కే బంగారంపై ఉత్సాహపూరిత క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను అందించనున్నట్టు ఫోన్‌ పే ప్రకటించింది. ఫోన్‌ పే నుండి కనీసం రూ.1000 విలువ కలిగిన డిజిటల్‌ బంగారం కొనుగోలు చేసే వినియోగదారులు, రూ.3000 వరకు గ్యారంటీ క్యాష్‌బ్యాక్‌ అందుకోవచ్చు. ఈ ఆఫర్‌ నవంబర్‌ 9-12, 2023 మధ్య జరిపే వన్‌-టైమ్‌ లావాదేవీలన్నిటికీ (ఒక వినియోగదారుకు ఒకసారి) చెల్లుతుంది. దేశంలోని 19,000 ప్లస్‌ పోస్టల్‌ కోడ్లలో నివసిస్తున్న 1 కోటికి పైగా కస్టమర్లు ఫోన్‌ పే వేదికలో అత్యంత స్వచ్ఛమైన 24కే బంగారాన్ని పారదర్శకమైన ధరల్లో కొనుగోలు చేశారు.

ఫోన్‌ పే ప్రముఖమైన డిజిటల్‌ పేమెంట్ల వేదికగా ఉండడమే కాక ప్రముఖమైన, అత్యంత విశ్వసనీయమైన భాగస్వాముల నుండి 99.99శాతం స్వచ్ఛమైనదిగా ధృవీకరించిన 24కే డిజిటల్‌ బంగారాన్ని అందిస్తుండడమే దీనికి కారణం. ఈ ధృవీకరించిన 24కే బంగారాన్ని కస్టమర్లు డిజిటల్‌ రూపంలో తయారీ ఖర్చులు ఏవీ లేకుండానే కొనుగోలు చేయవచ్చు. అలాగే ఉచిత స్టోరేజ్‌ కోసం ఇన్సూరెన్స్‌ సౌకర్యంతో బ్యాంక్‌ గ్రేడ్‌ లాకర్లను ఉపయోగించుకోవచ్చు. ఇవి కాకుండా ఫోన్‌ పే లో డిజిటల్‌ బంగారం కొనుగోలు చేయడం కోసం 24 గంటలూ షాపింగ్‌ చేసుకునే సౌకర్యం లాంటి ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆ సంస్థ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement