Wednesday, May 15, 2024

 SNDP ద్వారా శాశ్వ‌త ప‌రిష్కారం : మంత్రి త‌ల‌సాని

న‌గ‌రంలో వరద ముంపు నుంచి ఎస్‌ఎన్‌డీపీ ద్వారా శాశ్వత పరిష్కారం చూపుతామని రాష్ట్ర‌ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఈరోజు ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని నాగమయకుంట అభివృద్ధి పనులను మంత్రులు తలసాని, మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో ప్రజ‌లు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా రోడ్లు, సీవరేజ్, ఫ్లై ఓవర్ల నిర్మాణం, అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. ప్రతి ఏటా వర్షాకాలంలో కాలనీలు ముంపునకు గురవుతూ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఇబ్బందులుల లేకుండా చేస్తామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement