Thursday, May 2, 2024

కెసిఆర్, మ‌న్మోహ‌న్ సింగ్ లు త్వ‌ర‌గా కోలుకోవాలి – ప‌వ‌న్ క‌ల్యాణ్…

హైద‌రాబాద్ – తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్, భార‌త మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ లు క‌రోనా భారీన ప‌డిన నేప‌థ్యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు.. కేసీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆయ‌న కోలుకుని ఎప్ప‌టిలాగే ప్ర‌జా సేవ‌లో నిమ‌గ్నం కావాల‌ని దేవుడిని ప్రార్థిస్తున్నాన‌ని పేర్కొన్నారు. అలాగే, మ‌న్మోహ‌న్ సింగ్ ఎయిమ్స్‌లో చేరిన‌ట్లు స‌మాచారం అందింద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. ఆయ‌న కూడా త్వ‌ర‌గా కోలుకోవాల‌ని తాను దేవుడిని ప్రార్థిస్తున్నాన‌ని ఆయ‌న చెప్పారు. కాగా, ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు కూడా క‌రో్నా సోక‌డంతో ఆయ‌న ప్ర‌స్తుతం హోం క్వారంటైన్‌లో ఉండి అక్క‌డే చికిత్స కోవ‌డంతో ప్ర‌స్తుతం ఆయ‌న కోలుకున్నారు.. నేడు జ‌రిపిన టెస్ట్ లో ప‌వ‌న్ కు నెగిటివ్ వ‌చ్చింది.. అయిన‌ప్ప‌టికీ ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా ఆయ‌న మ‌రికొన్ని రోజులు ఫామ్ హౌజ్ లోనే ఉండ‌నున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement