Thursday, May 2, 2024

పరీక్షలు రద్దు చేయండి…. జగన్ సర్కార్ పై పవన్ ఫైర్

దేశం లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సీబీఎస్ఈ బోర్డు 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ… ఇంటర్ పరీక్షలను కూడా వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం మాత్రం ఒకటి నుంచి 9వ తరగతి వరకు సెలవులను ప్రకటిస్తూ… పరీక్షలను మాత్రం యథాతథంగా కొనసాగిస్తామని ప్రకటించింది.

ఈ విషయం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ పై మండిపడ్డారు. మీ నిర్ణయం వల్ల 16.5 లక్షల మంది విద్యార్థులు కాకుండా వారి కుటుంబాలు కూడా ఇబ్బందుల్లో పడతారని ఫైర్ అయ్యారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం కుంటి సాకులు చెబుతోందని ఆరోపించారు. పదో తరగతి పరీక్షలను, ఇంటర్ పరీక్షలను కూడా రద్దు చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. 2020లో పది పరీక్షలు రద్దు చేసినప్పుడు ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు పరీక్షలు రద్దు చేయడం లేదని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement