Thursday, May 2, 2024

HYD: రఘుమారెడ్డిని సన్మానించిన ఓరుగంటి వెంకటేష్

కర్మన్ ఘాట్, ఆగస్టు 18 (ప్రభ న్యూస్) : కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం నూతన పాలక మండలి సభ్యులు నల్ల రఘుమారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అభినందించారు. కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం నూతన కమిటీ సభ్యుడిగా ఎన్నికైన నల్ల రఘుమారెడ్డిని రాష్ట్ర బారాస నాయకులు ఓరుగంటి వెంకటేష్ గౌడ్ శాలువాతో సన్మానించి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

పాలకమండలి సభ్యులు సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఈ సందర్భంగా నల్ల రఘు మారెడ్డి తెలిపారు. పాలకమండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన పది రోజుల తర్వాత చైర్మన్ ఎన్నిక ఉంటుంది, చైర్మన్ గా నల్ల రఘుమారెడ్డి ఎన్నిక లాంచనమేనన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలుగా నియమితులైన బిళ్ళ కంటి కిరణ్ కుమార్ గుప్తా, మేక సురేందర్ రెడ్డి, చీర తిరుమలేష్, గోగిరెడ్డి అంజిరెడ్డి, గూడూరు మధుసూదన్ రెడ్డి, బిస్కుంట్ల సతీష్ గౌడ్ తదితరులు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారిలో డివిజన్ అధ్యక్షులు ముడుపు రాజ్ కుమార్ రెడ్డి, బొంబాయి, వసంత రెడ్డి, ఉమామహేశ్వర్, గౌరీదేవి రాజు, నిషికాంత్ రెడ్డి, గౌతమ్ రెడ్డి తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement