Friday, May 10, 2024

Evaready: ఎవెరెడీ అల్టిమా ఆల్కలీన్ బ్యాటరీలకు ప్రచారం చేస్తున్న నీరజ్ చోప్రా

హైదరాబాద్ : శక్తి, పనితీరు, విశ్వసనీయతకు పర్యాయపదంగా ఉన్న భారతదేశపు నంబర్ 1 బ్యాటరీ బ్రాండ్ అయిన ఎవెరెడీ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్, ఒలింపిక్ బంగారు పతక విజేత, ప్రపంచ నెంబర్ 1 పురుషుల జావెలిన్ స్టార్‌ నీరజ్ చోప్రాను తమ నూతన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. తమ సరికొత్త అల్టిమా ఆల్కలీన్ బ్యాటరీ సిరీస్‌ను విడుదల చేయడం ద్వారా శ్రేష్ఠత మరియు ఆవిష్కరణల పట్ల తన నిబద్ధతను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నందున ఈ భాగస్వామ్యం ఎవెరెడీకి ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. బ్యాటరీ విభాగంలో దిగ్గజ నాయకుడు, ఎవెరెడీ అండ్ ప్రస్తుత ఆసియా ఒలింపిక్స్ ఛాంపియన్ నీరజ్ చోప్రా, ఇద్దరూ తమ తమ రంగాలలో నంబర్ వన్ గా గుర్తింపు పొందారు.

ఈసందర్భంగా ఎవెరెడీ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ఎస్బీయూ హెడ్, బ్యాటరీస్ అండ్ ఫ్లాష్‌లైట్స్ అనిర్బన్ బెనర్జీ మాట్లాడుతూ… టర్బోలాక్ టెక్నాలజీతో వినూత్నంగా రూపొందించబడిన తమ అల్టిమా ఆల్కలీన్ బ్యాటరీ సిరీస్, స్మార్ట్ అప్పీల్, 400శాతం దీర్ఘకాలిక పనితీరుతో అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల అవసరాలను పరిష్కరించడంలో తమ అంకితభావాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. నీరజ్ చోప్రా అసాధారణ ప్రయాణం, తమ బ్రాండ్ పరిణామం, విస్తరణకు అద్దం పడుతుందన్నారు. నీరజ్ చోప్రా మాట్లాడుతూ… దశాబ్దాలుగా భారతీయ గృహాలలో అంతర్భాగంగా ఉన్న, ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందిన బ్రాండ్ అయిన ఎవెరెడీ తో భాగస్వామ్యం చేసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement