Thursday, May 2, 2024

HYD: మోడీ చిత్రపటానికి పాలాభిషేకం..

భారతీయ జనతా పార్టీ మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ మహిళా మోర్చా నాయకురాలు రజిని, వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీకి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో దేశ ప్రజలు ముఖ్యంగా మహిళామూర్తులు రక్షాబంధన్ కానుకగా వంట గ్యాస్ భారాన్ని తగ్గించి మహిళా మూర్తులకు ఇంటి పెద్దన్న పాత్ర పోషించారన్నారు.ఉజ్వల పథకం ద్వారా లబ్ధిదారులకు 400 రూపాయలు అక్కా చెల్లెలు ఒకరికి 200 రూపాయలు తగ్గింపు చేయడం జరిగిందన్నారు.

ఈ పథకం ద్వారా దేశంలో 33కోట్ల మహిళామూర్తులకు లబ్ధి చేకూరుతుందన్నారు. రాష్ట్రంలో వాళ్లు తీసుకునే కమీషన్లు తగ్గించమని అడిగితే నానా రచ్చ చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి అధ్యక్షులు పెండాల నరసింహ, బిజెపి ప్రధాన కార్యదర్శి గాజుల మధు, సీనియర్ నాయకులు శూల ప్రభాకర్, యాదగిరి యాదవ్, బెల్లంకొండ నాగరాజు, సిద్దిపేట ప్రభాకర్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, గోలి శ్రీనివాస్ రెడ్డి, విక్కీ సాగర్, రంగారెడ్డి, చంద్రశేఖర్ చారి, అరుణమ్మ, ప్రియాంక, సునీత, మల్లికార్జున్, ఆవుల సత్తయ్య, సుధాకర్ నేత, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement