Sunday, April 28, 2024

HYD: బంగారు పతకంసాధించిన విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

కర్మన్ ఘాట్, డిసెంబర్ 29 (ప్రభ న్యూస్) అంతర్ జాతీయ టార్గెట్ బాల్ పోటీల్లో లాస్య మరియు శరత్ కళ్యాణ్ లు బంగారు పతకం సిల్వర్ పథకం సాధించడం గర్వించదగ్గ విషయమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ స్థాయి టార్గెట్ బాల్ పోటీలలో తెలంగాణ రాష్ట్రం ఎల్.బి.నగర్ నియోజకవర్గనికి చెందిన విద్యార్థులు తమ సత్తాను చాటారు.

నేపాల్ దేశంలో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి టార్గెట్ బాల్ పోటీలలో లాస్య మరియు శరత్ కళ్యాణ్ ను తమ ప్రతిభను చాటారు.దానిలో బాగంగా అట్టి విద్యార్థులు శుక్రవారం ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కలవగా వారిని సుధీర్ రెడ్డి అభినందించారు.టార్గెట్ బాల్ పోటీల్లో లాస్యకు బంగారు పతకం,శరత్ కళ్యాణ్ కు సిల్వర్ పతకం రావడం జరిగింది అని తెలిపారు.వీరు ఇద్దరు ఎల్.బి.నగర్ నియోజకవర్గనికి కావడం ఎంతో గర్వించదగ్గ విషయం అని తెలిపారు.రాబోయే రోజుల్లో వీరు మరిన్ని పతకాలు సాధించి దేశానికి మంచిపేరు తేవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.మా యొక్క సహాయ,సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి అని తెలిపారు.నేపాల్ దేశంలో జాతీయ ఆటగా టార్గెట్ బాల్ కు మంచి గుర్తింపు ఉందని తెలిపారు.అలాగే చదువు మీద కూడా దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సుంకోజు కృష్ణమాచారి,నిష్కాంత్ రెడ్డితదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement