Sunday, April 28, 2024

TS : వ‌ర‌ద‌కాలువ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపిన ఎమ్మెల్యే…

ఎల్బీనగర్, ఏప్రిల్ 3(ప్రభ న్యూస్) ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్నట్లు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవీరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. మన్సురాబాద్ ప్రెస్ కాలనీలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బుధవారం స్థానికులతో పాదయాత్ర ద్వారా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మన్సూరాబాద్ ప్రెస్ కాలనీలోని వరద కాలువ శాశ్వత పరిష్కారానికి కృషిచేసిన శాసనసభ్యులు సుధీర్ రెడ్డికి ప్రెస్ కాలనీ సంక్షేమ సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

పైప్ లైన్ నిర్మించి దీర్ఘకాలిక సమస్యలు శాశ్వతంగా పరిష్కరించిన ఎమ్మెల్యేను కాలనీ వాసులు శాలువా తో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్ సీ స్మశాన వాటిక ప్రహరీగోడ నిర్మాణానికి నిర్మాణం చేయిస్తానని అలాగే కాలనీ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎస్ సీ స్మశాన వాటిక స్నానాల గదుల ఏర్పాటు చేయిస్తానని స్తానికులకు హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement