Saturday, May 4, 2024

Breaking: మింట్ కాంపౌండ్ లో మిస్ ఫైర్.. కానిస్టేబుల్ మృతి

హైదరాబాద్ లోని మింట్ కాంపౌండ్ లో మిస్ ఫైర్ అయ్యింది. తుపాకీ మిస్ ఫైర్ తో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రామయ్య మృతి చెందారు. కానిస్టేబుల్ రామయ్య ప్రింటింగ్ ప్రెస్ లో సెక్యూరిటీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. తుపాకిని శుభ్రం చేస్తుండగా ఫైర్ అయినట్లుగా అధికారులు తెలిపారు. మిస్ ఫైర్ తో తీవ్ర గాయాలైన రామయ్యను అధికారులు ఆసుపత్రులో చేర్చారు. అయితే కానిస్టేబుల్ రామయ్య అప్పటికే మృతిచెందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement