Thursday, May 2, 2024

తెలంగాణకు మరో రూ.747 కోట్ల పెట్టుబడులు

తెలంగాణకు మరో రూ.747 కోట్ల విలువైన పెట్టుబడులు రానున్నాయి. హైదరాబాద్ సమీపంలోని జినోమ్ వ్యాలీలో కెనడాకు చెందిన ఇవాన్‌హో కేంబ్రిడ్జి అండ్ లైట్‌హౌస్ కాంటన్ సంస్థ రూ.747 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది. మంత్రి కేటీఆర్‌తో జరిగిన సమావేశంలో ఈ మేరకు సంస్థ ప్రతినిధులు తమ నిర్ణయం ప్రకటించారు. పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సంస్థను ఏర్పాటు చేయనున్నారు.

లైఫ్ సైన్సెస్ రియల్ ఎస్టేట్ రంగంలో పెన్షన్ ఫండ్‌తో ఈ తరహా పెట్టుబడులు దక్షిణ ఆసియాలోనే ఇది మొదటిసారి అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. దేశంలో లైఫ్ సైన్సెస్ రంగానికి బెంచ్ మార్కుగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి పెట్టుబడులు రావడం వల్ల లైఫ్ సైన్సెస్ రంగంలో లీడర్‌గా ఉన్న హైదరాబాద్ మరింత ముందుకు పోతుందని కేటీఆర్ తెలిపారు.

ఈ వార్త కూడా చదవండి: తెలంగాణలో డెల్టా వేరియంట్ టెన్షన్ లేదు

Advertisement

తాజా వార్తలు

Advertisement