Wednesday, May 15, 2024

బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి రూ.5 లక్షల జరిమానా

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టు బుధవారం రూ.5 లక్షల జరిమానా విధించింది. బెంగాల్‌ ఎన్నికల సందర్భంగా కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కౌషిక్‌ చందాకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేస్తూ మమత గతంలో దాఖలు చేశారు. తాజాగా ఆ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ న్యాయ వ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదించారంటూ కోర్టు మమతకు జరిమానా విధించింది. కాగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి దాఖలు చేసిన దరఖాస్తును జస్టిస్ కౌషిక్‌ చందా స్వయంగా తిరస్కరించారు. ఈ కేసును తన వ్యక్తిగత అభీష్టానుసారం విచారించకూడదని నిర్ణయించుకున్న ఆయన ఈ కేసును తన బెంచ్ నుంచి తొలగించారు.

ఇది కూడా చదవండి: అసోంలో భారీ భూకంపం

Advertisement

తాజా వార్తలు

Advertisement