Thursday, May 16, 2024

TS: కాంగ్రెస్ గూటికి మీర్​పేట్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు

మహేశ్వరం అర్బన్, ఫిబ్రవరి 16(ప్రభన్యూస్): కాంగ్రెస్ లోకి బిఆర్ఎస్ నాయకుల వలసలు పెరుగుతున్నాయి. అందులో భాగంగానే మీర్పేట్ కార్పొరేషన్‌లో మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి సమక్షంలో మీర్‌పేట్‌ కార్పొరేషన్ కార్పొరేటర్లు జిల్లెల అరుణ ప్రభాకర్ రెడ్డి, పిడుగు ప్రమీల యాదగిరి కాంగ్రెస్ కండువా పార్టీలోకి ఆహ్వానిచ్చారు. తమ డివిజన్లలో అభివృద్ధి పనులు కోసం కేఎల్ఆర్ నాయకత్వంపై నమ్మకంతో హస్తం గూటికి చేరినట్లు కార్పొరేటర్లు తెలిపారు.

- Advertisement -

ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూపార్టీలో చేరిన ఆడపడుచులకు తగిన గౌరవం, గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మీర్​పేట్​ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజాప్రతినిధులు పోరెడ్డి పద్మ భాస్కర్ రెడ్డి, అక్కి మాధవి ఈశ్వర్ గౌడ్, వేముల నరసింహ, సిద్దాల మౌనిక శ్రీశైలం, గజ్జల రామచంద్రయ్య, ఎడ్ల మల్లేష్ ముదిరాజ్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement