Tuesday, April 30, 2024

Delhi: కాంగ్రెస్‌కు కేంద్రం షాక్….పార్టీ బ్యాంక్ ఖాతాలుసీజ్…

కేంద్రం కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చింది.. కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంకు అకౌంట్లు సీజ్ చేసిన విషయాన్ని ఆ పార్టీ నేత అజయ్ మాకెన్ వెల్లడించారు. ఆ ఎల‌క్ర్టోర‌ల్ బాండ్లు రాజ్యాంగ విరుద్దమని సుప్రీం ఇచ్చిన‌ తీర్పుతో రాజకీయ పార్టీలకు ఫండింగ్ నిలిచిపోయింది.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అకౌంట్లను సీజ్ చేశారు. తాము ఇచ్చే చెక్కులను బ్యాంక్‌లు తీసుకోవడంలేదని తమకు సమాచారం అందినట్లు కాంగ్రెస్ నేత మాకెన్ తెలిపారు. యూత్ కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్లను ప్రభుత్వం సీజ్ చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అకౌంట్లు కూడా సీజ్ అయ్యాయన్నారు. ఎన్నికలకు రెండు నెల‌ల‌ ముందే విపక్షాల అకౌంట్లను సీజ్ చేశారని, ఇది ప్రజాస్వామ్యాన్ని సీజ్ చేసినట్లే అని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం తమ వద్ద డబ్బు లేదని, విద్యుత్తు బిల్లు, ఉద్యోగుల జీతాలు ఇచ్చేందుకు అమౌంట్ లేదన్నారు. అన్నింటిపైనా ప్రభావం పడుతుందని, రాహుల్ గాంధీ న్యాయ యాత్రతో పాటు రాజకీయ కార్యక్రమాలపై ప్రభావం పడుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement