Sunday, April 28, 2024

TS: ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డ‌ నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్..

తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లచ్చు నాయక్ లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. ఇవాళ‌ ఉదయం రూ.3లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

వివరాల్లోకి వెళితే.. ఔషదాల టెండర్‌ నిమిత్తం డాక్టర్ లచ్చు నాయక్ రూ.3లక్షలు డిమాండ్ చేశారు. ఒప్పుకున్న నగదును ఇవాళ ఉదయం ఇంట్లో తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement