హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద ఉపాధ్యాయ సంఘాలు మహా ధర్నా నిర్వహించాయి. బదిలీలు, పదోన్నతులపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఉపాధ్యాయ సంఘాలు ధర్నా చేపట్టాయి. 317 జీవోతో నష్టపోయిన టీచర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యావాలంటీర్లు, కార్మికులను నియమించాలని కోరారు. పుస్తకాలు, యూనిఫాంలు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement