Thursday, May 9, 2024

HYD : అమరుల ఆత్మ గోషించే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన.. ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి గౌడ్..

ఎల్బీనగర్, నవంబర్ 7(ప్రభ న్యూస్)
తెలంగాణ బిడ్డల బలిదానాలను చూసి చెల్లించిన సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తే అమరుల ఆత్మ బలిదానాలు గోషించే విధంగా టిఆర్ఎస్ పాలన ఉందని ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుయాష్కి గౌడ్ మండిపడ్డారు. మన్సురాబాద్ డివిజన్ అధ్యక్షులు బుడ్డ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు.

ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కి గౌడ్ ఎల్బీనగర్ చౌరస్తాలోని తెలంగాణ అమరవీరుడుశ్రీకాంతాచారి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ పార్టీ అని, ఎల్బీనగర్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎల్బీనగర్ లో ప్రజల నుంచి వస్తున్న ప్రచార స్పందనను బట్టి కచ్చితంగా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని తెలిపారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ పథకాల అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జక్కడ్డి ప్రభాకర్ రెడ్డి, మిద్దెల జితేందర్, బీమిడి రామకృష్ణారెడ్డి, ఇ రిగి రమేష్,కొప్పుల వెంకటరెడ్డి, ఎర్రబల్లి సతీష్ రెడ్డి, మంజులా రెడ్డి, చందు నాయక్, ముద్దగొని రాము గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement