Sunday, April 28, 2024

TS : అల్కాపురి కాలనీలో కొండా సంగీత రెడ్డి ప‌ర్య‌ట‌న

మణికొండ , ఏప్రిల్ 7(ప్రభ న్యూస్): గర ప్రజలంతా భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతున్నారని కొండా సంగీత రెడ్డి తెలిపారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండ మున్సిప‌ల్‌ డివిజన్ అల్కాపురి కాలనీలో ఆమె ప‌ర్య‌టించారు. ఈసంద‌ర్భంగా మహాత్మా గాంధీ పార్కును సందర్శించారు.

- Advertisement -

ఈ సందర్భంగా వాకర్స్ తో మాట్లాడిన కొండా సంగీతారెడ్డి.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ ప్రాంతంలో దోమలు, పారిశుధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయని స్థానికులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. చేవెళ్ల ఎంపీగా కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించుకోవడం ద్వారా తమ సమస్యల పరిష్కరించుకోవచ్చని ఆమె వారికి సూచించారు. గత పదివేల కాలంలో నరేంద్ర మోడీ హయాంలో పట్టణాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను ఆమె వారికి వివరించారు.

ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపల్ వైస్ చైర్మన్ కొండకళ్ళ నరేందర్ రెడ్డి, మణికొండ బిజెపి అధ్యక్షులు బీరప్ప, మణికొండ బిజెపి ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, మహిళా మోర్చా నాయకురాలు అనిత దేవి, వినోద్ కుమార్ వివిధ పార్టీ నాయకులు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభిమానులు కార్యకర్తలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement