Thursday, May 2, 2024

ఆరు నెల‌ల్లో మేడిన్ తెలంగాణ వ‌స్త్రాలు..

హైదరాబాద్‌, భారత టెక్స్‌టైల్‌ రం గంలో మైలురాయిగా నిలిచే ఫ్యాక్టరీలు.. వరంగల్‌ లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ లో త్వరలో అందుబాటులోకి రానున్నాయి. మరో ఆరు నెలల్లో కొరియా దేశానికి చెందిన టెక్స్‌టైల్‌ దిగ్గజం యంగ్వా న్‌ తన ఫ్యాక్టరీల నిర్మాణం పూర్తి చేయనుంది. ఆరు నెలల తర్వాత ప్రపంచానికి మేడిన్‌ తెలంగాణ వస్త్రాలు కాకతీయ టెక్స్‌టైల్‌ పార్క్‌ నుంచి అందనున్నాయి. ఈ మేరకు కంపెనీ చైర్మన్‌ కిహాక్‌ సుంగ్‌ ప్రకటించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీ రామారావు, పంచాయతీరాజ్‌ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, పరిశ్రమల శాఖ ముఖ్య అధికారులతో కంపెనీ చైర్మన్‌ కిహాక్‌ సుంగ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ సమా వేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం సందర్భంగా తమ కంపెనీ, వరంగల్‌ కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ లో ఇప్పటికే ప్రకటించిన విధంగా తన పెట్టుబడి ప్రణాళిక కొనసాగుతుందని తెలిపారు. వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కులో తమ కంపెనీ రానున్న ఆరు నెలల కాలంలో ఐదు ఫ్యాక్టరీలను నిర్మాణం పూర్తి చేస్తుందని, రెండవ దశలో మరో మూడు ఫ్యాక్టరీ లను సైతం నిర్మించబోతున్నట్లు కంపెనీ చైర్మన్‌ తెలి పారు. గతంలో ప్రకటించిన ప్రణాళిక మేరకు ఇప్ప టికే ఫ్యాక్టరీల నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నా… సంవ త్సర కాలం పాటు కరోనా పరిస్థితులు మరియు అంత ర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సందిగ్దత వలన కొంత ఆలస్యం అయినట్లు తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అన్నీ మెరుగుపడుతున్నాయని, భారత దేశంలో తమ కార్యకలాపాలను వరంగల్‌ వేదికగా ప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు తమ కంపెనీ ఇప్పటికే సిద్ధం చేసిన ఫ్యాక్టరీల నిర్మాణ ప్రణాళికలను కంపెనీ యాజ మాన్యం వీడియో కాన్ఫరెన్స్‌ లో మంత్రులకు వివరిం చింది. భారత దేశంలో వేగంగా ఫ్యాక్టరీలను నిర్మాణం చేసే కంపెనీలతో వీటి నిర్మాణం చేపడుతున్నట్లు… అత్యంత వేగంగా వీటిని పూర్తి చేసేందుకు తమ కంపెనీ కట్టుబడి ఉన్నదని ఈ సందర్భంగా కంపెనీ తెలిపింది. వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌ లో తమ పెట్టుబడి ప్రకటన నాటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం తమ కు అన్ని విధాలుగా బాసటగా నిలుస్తూ వస్తుందని ఈ సందర్భంగా కంపెనీ తెలంగాణ ప్రభుత్వం పై ప్రశంసల జల్లు కురిపించింది.
భారత టెక్స్‌టైల్‌ రంగంలో మైలురాయి: కేటీఆర్‌
ప్రపంచ దిగ్గజ టెక్స్‌టైల్‌ కంపెనీ యంగ్వాన్‌ వరంగల్‌ నగరంలో తమ ఫ్యాక్టరీలను త్వరలో పూర్తి చేయడం కేవలం తెలంగాణలోనే కాకుండా భార తదేశ టెక్స్‌టైల్‌ రంగంలోనూ ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్‌ అన్నారు. యంగ్వాన్‌ లాంటి భారీ కంపెనీ తెలంగాణకి వచ్చిన తర్వాత టెక్స్‌టైల్‌ పార్క్‌ లో మరి న్ని కొరియన్‌ కంపెనీలు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ అన్నారు. కంపెనీ ఫ్యాక్టరీల నిర్మాణానికి సంబంధించి అవస రమైన అన్ని రకాల సహాయ సహకారాలను తమ శాఖ తరఫున అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ కంపెనీ చైర్మన్‌ సుంగ్‌ కు హామీ ఇచ్చారు.
వరంగల్‌ వారికి ఉద్యోగాలివ్వండి: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
కంపెనీ ఏర్పాటు తర్వాత 12వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో స్థానిక వరంగల్‌ ప్రజలకు ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా గ్రామీణ అభి వృద్ధి శాఖ వరంగల్‌ జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, మంత్రి కేటీఆర్‌ ని కోరారు. తమ శాఖ ఆధ్వ ర్యంలో పనిచేసే స్వయం సహాయక సంఘాలు మరి యు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని ఈ సం దర్భంగా కేటీఆర్‌ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు కోరారు. యంగ్వాన్‌ కంపెనీ కార్యకలాపాలకు అవస రమైన రీతిగా నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు తమ శాఖ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా కేటీఆర్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement