Thursday, April 25, 2024

మంత్రి మ‌ల్లారెడ్డిపై అంత‌ర్గ‌త విచార‌ణ ప్రారంభం…

హైదరాబాద్‌, : మంత్రి మల్లారెడ్డి ఆడియోటేపు వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. బుధవారం మల్లారెడ్డి సీఎంను కలిసి దీనిపై వివరణ ఇచ్చినట్లు తెలిసింది. కాగా ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థను బెదిరించిన ఘటనలో ఆడియోపై అంతర్గత విచారణ కొనసాగుతోంది. బెదిరింపు ఆడియోలో ఉన్నది తన వాయిస్‌ కాదని.. తనదని నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ మల్లారెడ్డి సవాల్‌ చేశారు. అయితే వాయిస్‌ తనది కానపుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని అధిష్టానం ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఓ లేఅవుట్‌లో వాటా కావాలంటూ మంత్రి మల్లారెడ్డి బెదిరించినట్లుగా చెబుతున్న ఆడియో రాష్ట్రవ్యాప్తంగా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. మంగళవారం మంత్రి మాట్లాడి నట్లుగా పేర్కొంటున్న ఆడియో టేపు మీడియా, సోషల్‌ మీడియాలో సంచలనం రేపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement