Sunday, April 14, 2024

వార్డు ఎన్నికలపై పొలిటికల్‌ పార్టీలతో సమావేశం..

బెల్లంపల్లి : బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 30వ వార్డు ఎన్నిక గురించి అన్ని పార్టీలతో మున్సిపల్‌ కార్యాలయంలో కమీషనర్‌ ఆకుల వెంకటేష్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఓటర్ల జాబితా, పోలింగ్‌ స్టేషన్లపై చర్చించారు. ఈ ఓటర్ల జాబితా పోలింగ్‌ స్టేషన్లపై ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 9వ తేది వరకు మున్సిపల్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement