హైదరాబాద్ : ఖోస్లా వెంచర్స్ అండ్ ఎయిర్టెల్ వంటి పెట్టుబడిదారుల మద్దతు కలిగి ఉండటంతో పాటుగా బ్లూ కాలర్ రిక్రూట్మెంట్ రంగంలో అగ్రగామిగా ఉన్న వాహన్ టెక్నాలజీస్, హైదరాబాద్లో బ్లూ కాలర్ రిక్రూట్మెంట్పై ఒక సెమినార్ను నిర్వహించింది. ఫుడ్ డెలివరీ, క్విక్ సర్వీస్, ఇ-కామర్స్ అండ్ తయారీ వంటి పరిశ్రమల నుండి పెరుగుతున్న డిమాండ్ కారణంగా రిక్రూట్మెంట్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగంగా గుర్తింపు పొందిన బ్లూ-కాలర్ అండ్ గిగ్ రిక్రూట్మెంట్పై వాహన్ దృష్టి సారించింది. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం, 2030 నాటికి 2.35 కోట్ల మంది గిగ్ వర్కర్లు ఉంటారు. 2020 – 2030 మధ్య కాలంలో 200శాతం వృద్ధి చెందనున్నారు.
ఈసందర్భంగా వాహన్ టెక్నాలజీస్ సంస్థ సప్లై అక్విజిషన్ హెడ్ సిద్ధార్థ్ చౌహాన్ మాట్లాడుతూ…. దేశంలో గిగ్ వర్కింగ్కు పెరుగుతున్న ప్రజాదరణ కారణంగా రిక్రూట్మెంట్ పరిశ్రమ, ముఖ్యంగా బ్లూ-కాలర్ విభాగం వృద్ధి గురించి వివరాలను వెల్లడించారు. బ్లూ-కాలర్ ఉపాధిలో సవాళ్లను పరిష్కరించడం, బ్లూ కాలర్ కార్మికులకు ఉపాధి కల్పించడంలో సహాయపడేటప్పుడు వ్యక్తులు మంచి నిష్క్రియాత్మక ఆదాయ వనరును పొందడంలో సహాయపడటంపై తమ దృష్టి ఉందని చౌహాన్ చెప్పారు.
వాహన్ టెక్నాలజీస్ , ఛానల్ హెడ్, దివ్య గోయెల్ మాట్లాడుతూ…. బ్లూ కాలర్ వర్కర్లకు పెరుగుతున్న డిమాండ్తో, బ్లూ కాలర్ రిక్రూట్మెంట్ను కేవలం వ్యాపార అవకాశంగా మాత్రమే కాకుండా వ్యక్తులకు వారి ఆదాయాలను పెంచడానికి, వారి జీవనశైలిని మెరుగు పరచడంలో సహాయపడటానికి ఒక ఫ్రీలాన్సింగ్, అదనపు ఆదాయ వనరుగా మార్చడమే తమ లక్ష్యమన్నారు.