Monday, April 29, 2024

భారీగా గంజాయి ప‌ట్టివేత‌..

హైదరాబాద్ నగరంలో మరోసారి పెద్దమొత్తంలో గంజాయి పట్టుబడింది. గంజాయిని సరఫరా చేస్తున్న ఆరుగురు సంభ్యుల ముఠాను మల్కాజిగిరి జోన్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద 60 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దానివిలువ రూ.కోటీ 20 లక్షల విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ మీదుగా మహారాష్ట్రకు గంజాయిని సరఫరా చేస్తున్నారని వెల్లడించారు. వారినుంచి మూడు కార్లు, ఎనిమిది సెల్‌ఫోన్లు, రూ.10 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement