Friday, May 17, 2024

అపార కరుణ, అంకితభావానికి ప్రతీక హనుమాన్ జయంతి : ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా

అపార కరుణ, అంకితభావానికి ప్రతీక హనుమాన్ జయంతి అని రాష్ట్ర టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా.. హైదరాబాద్ లోని సనత్ నగర్ లో సనత్ నగర్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జరిగిన హనుమాన్ జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా విచ్చేశారు. ఈ సందర్భంగా.. హైదరాబాద్ లోని సనత్ నగర్ లో హనుమాన్ దేవాలయంలో దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో దాదాపు మూడు వేల మందికి అన్నదానం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. హనుమంతుని జీవితం, ఆదర్శభావాలు మనకు ఎల్లవేళలా స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. ఆంజనేయుడి కృపతో ప్రతి ఒక్కరికి అన్నింటా శుభం కలగాలని కోరుకుంటూ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంజనేయ స్వామి మన అందరికీ అండగా నిలిచి, చేసే ప్రతి పనిలో విజయం సాధించేలా ఆశీర్వదించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో.. సనత్ నగర్ కార్పోరేటర్ కోలన్ లక్ష్మీబాల్ రెడ్డి, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఊటుకూరి శ్రీనివాస్ గుప్తా, ఐవీఎఫ్ సనత్ నగర్ డివిజన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గుప్తా, బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ సింగారపు శ్రీనివాస్ గుప్తా, బిజ్జాల శివశంకర్ గుప్తా, చీమకుర్తి శ్రీనివాస్ మూర్తి, సౌరబ్ చేతన్, సౌరబ్ పటేల్, సింగారపు శ్రీనివాస్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement