Friday, April 26, 2024

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌.. మొక్కలు నాటిన వంశీకృష్ణ

రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో మహాన్యూస్‌ ఎండీ మారేళ్ల వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్‌ను కార్యాలయంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమాన్ని చేపట్టి, రికార్డులు సృష్టిస్తున్న ఎంపీ సంతోష్‌కు అభినందనలు తెలిపారు. మొక్కలను నాటి భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ఆక్సీజన్‌ను అందించడమే కాకుండా.. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారని వంశీకృష్ణ కొనియాడారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ జిల్లాల్లో మొక్కలు నాటాలని ఉద్యోగులకు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement