Friday, April 19, 2024

భార‌త్ లోకి ఉగ్ర‌వాదుల చొర‌బాటు-వారితో పోరాడి మ‌ర‌ణించిన జ‌వాను

పీవోకే నుంచి ఉగ్ర‌వాదుల చొర‌బాటు జ‌రుగుతోంద‌ని సైన్యానికి విశ్వ‌స‌నీయ స‌మాచారం అందింది. దీంతో జూన్ 7-8 అర్ధ‌రాత్రి స‌మ‌యంలో గరంగ్ నార్ సమీపంలో ఆకస్మిక దాడికి దిగింది. ఆంబుష్ పార్టీ నైట్ విజన్ పరికరాల ద్వారా ఉగ్రవాదులను క‌ద‌లిక‌ల‌ను ట్రాక్ చేసింది. సుమారు 01.15 గంట‌ల‌కు కాల్పులు జ‌రిగాయి. దీంతో ఒక ఉగ్ర‌వాది చ‌నిపోయారు. మ‌రో ఉగ్ర‌వాది నియంత్ర‌ణ రేఖ మీదుగా పారిపోయాడు. అయితే ఈ కాల్పుల స‌మ‌యంలో సైనికుడు నాయక్ జస్వీర్ సింగ్ అమ‌రుడ‌య్యారు. జూలై 8వ తేదీన ఉగ్ర‌వాది మృత‌దేహం వెలికితీశారు. ఎన్ కౌంట‌ర్ జ‌రిగిన స్థ‌లంలో ఒక ఏకే సిరీస్ రైఫిల్, నాలుగు పిస్టల్స్, నాలుగు గ్రెనేడ్‌లు, పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఎన్ కౌంట‌ర్ జ‌రిగినప్పుడు ఆంబుష్ పార్టీలో భాగంగా ఉన్న నాయక్ జస్వీర్ సింగ్ కు కూడా బుల్లెట్ గాయాలు అయ్యాయి. దీంతో ఆయ‌న‌ను వెంటనే మిల‌ట‌రీ హాస్పిట‌ల్ కు తీసుకెళ్లారు. కానీ అక్క‌డికి చేరుకోగానే జవాన్ మృతి చెందిన‌ట్టు డాక్టర్లు ధృవీక‌రించారు. వీర జ‌వాన్ కు భార్య, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. నాయక్ జస్వీర్ సింగ్ భారత సైన్యం విలువలు, సంప్రదాయాలు, నీతిని ప్రతిబింబించారు. నేడు లెఫ్టినెంట్ జనరల్ ADS ఔజ్లా, GOC చినార్ కార్ప్స్ చినార్ వార్ మెమోరియల్ వద్ద అన్ని ర్యాంక్‌ల తరపున పుష్పగుచ్ఛం ఉంచారు. జ‌వాన్ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం స్వ‌స్థ‌లానికి పంపించారు. పూర్తి సైనిక గౌరవాలతో నేడు అంత్య‌క్రియలు నిర్వ‌హించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement