Thursday, May 2, 2024

గణేష్ శోభాయాత్ర, నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది : మంత్రి తలసాని

ఖైరతాబాద్‌ వినాయకుడిని దర్శించుకుని మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌ చివరి పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే వినాయక చవితి ఉత్సవాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా ఉత్సవాలు నిర్వహించామని తెలిపారు. ఖైరతాబాద్‌ మహాగణపతిని లక్షలాదిమంది భక్తులు దర్శించుకున్నారని వెల్లడించారు. శనివారం ఉదయం వరకు వినాయకుల నిమజ్జనం ముగుస్తుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement