Sunday, April 28, 2024

Uppala Srinivas Gupta: బ్యాడ్మింటన్ లో గెలుపొందిన వారికి మెమొంటోల అందజేత..

హైద‌రాబాద్ : ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం బీఎన్ రెడ్డి న‌గ‌ర్ లో నిర్వ‌హించిన‌ సుధాకర్ రెడ్డి మెమోరియల్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ 2023లో గెలుపొందిన బ్యాడ్మింటన్ క్రీడాకారులకు తెలంగాణ టూరిజం పూర్వ చైర్మన్ అండ్ రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ వైస్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మెమొంటోలు అందజేశారు. గత మూడు రోజుల నుంచి బ్యాడ్మింటన్ పోటీల్లో గెలిచిన క్రీడాకారులకు మెమెంటోస్ ను పద్మశ్రీ కమిషనర్ జీఎస్టీ అండ్ సెంట్రల్ ఎక్సైజ్, అండ్ వెంకట్రావు బ్యాడ్మింటన్ అసోసియేషన్ తెలంగాణ ఉపాధ్యక్షుడుతో కలిసి మెమెంటోలు అందజేశారు.

ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న 300మంది క్రీడాకారులు 30 35ప్లస్, 40 45 ప్లస్, 50 55 ప్లస్, 60 65 ప్లస్, 70 75 ప్లస్ ఏజ్ లిమిట్ తో పాల్గొన్నారు. గెలిచిన క్రీడాకారులు 1) 35 ప్లస్ లో (పురుషుల సింగిల్) మోహన్ సుబ్రహ్మణ్యం, 2) పురుషుల డబుల్స్ లో ఉదయ్ అండ్ మోహన్ గెలుపొందారు. 3) మహిళల సింగిల్ లో హరిత దండు, ఉమెన్ డబుల్స్ లో మంజు అండ్ లీల గెలుపొందారు. 75 ప్లస్ లో మెన్ సింగిల్ లో గెలుపొందిన క్రీడాకారుడు రాజలింగం మెన్ డబుల్స్ లో రాజలింగం అండ్ నర్సయ్య గెలుపొందారు. ఈ కార్యక్రమంలో అతిథులు రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, యువిఎన్ బాబు, ప్రభాకర్ రెడ్డి, చైర్మన్ డి.ఎస్.పి.ఏ, రవిబాబు ప్రెసిడెంట్ భద్రాద్రి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉప్పల రెడ్డి సెక్రెటరీ ఖమ్మం బ్యాడ్మింటన్ అసోసియేషన్ సంజీవ్ కుమార్ అడిషనల్ డీసీపీ వరంగల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆఫ్ ది టోర్నమెంట్, డా.సావిత్రి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement