Thursday, April 25, 2024

లాండ్రీ, క్షౌర షాపుల‌కు ఫ్రీ ప‌వ‌ర్ – కెసిఆర్

హైదరాబాద్‌, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని క్షౌర వృత్తి శాలలకు (కటింగ్‌ షాపులకు), లాండ్రీ షాపులకు, దోభీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్తు ఉచితంగా ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. అత్యంత బలహీన వర్గాల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వారి సంక్షేమం కోసం ఇప్పటికే అనేక పథకాలు అమలు పరుస్తున్నామని పేర్కొన్న ఆయన ఈ నిర్ణయం ద్వారా 250 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్‌ అందజేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా రజక సంఘాలు, నాయీ బ్రా హ్మణ సంఘాలు ప్రభుత్వానికి ఇప్పటికే చేసిన విజ్జప్తులను పరిశీలించిన మీదట సిీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయాన్ని అమలు చేసేం దుకు సంకల్పించారు. ఈ మేరకు ఈ అంశంపై తక్షణమే జీవో జారీ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి భూపాల్‌ రెడ్డిని ఆదేశించారు. వెనువెంటనే సీఎం ఆదేశాల మేరకు అందుకు సంబంధించిన జీవోను అధికారులు విడుదల చేశారు. ఈ ఉచిత విద్యుత్తు సరఫరా ఏప్రిల్‌ 1 నుంచే అమల్లోకి రానున్నది.
ఈ నిర్ణయం ద్వారా గ్రామ స్థాయి నుంచి జీహచ్‌ఎంసీ దాకా ఉన్న కటింగ్‌ షాపులకు, లాండ్రీ షాపులకు, దోభీ ఘాట్లకు 250 (రెండు వందల యాభై) యూనిట్ల వరకు నాణ్యమైన కరెంటు ఉచితంగా అందుబాటులోకి రానున్నదని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. తద్వారా, తరతరాలుగా కుల వృత్తిని ఆధారంగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్న తెలంగాణలోని లక్షలాది రజక, నాయీ బ్రా హ్మణ కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నదన్నారు. సాంకేతికాభివృద్ధి కారణంగా పలు రకాల యంత్రాలు వీరి కుల వృత్తుల నిర్వహణలో దోహద పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఉచిత విద్యుత్తు నిర్ణయం ద్వారా వృత్తి దారులకు శారీరక శ్రమ తగ్గి, ఆర్థిక వెసులు బాటు కూడా కలగనున్నదని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement