Sunday, April 28, 2024

RR : రేపు షాద్ నగర్ కు ఈటెల

షాద్ నగర్, నవంబర్​ 13(ప్రభ న్యూస్) షాద్ నగర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అందె బాబయ్య విజయ సంకల్ప సభ కోసం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. పట్టణంలోని చిన్న రాములు గ్రౌండ్ (యాగశాల వేదిక) పెద్ద ఎత్తున వేలాది మందితో విజయసంకల్ప సభ ఏర్పాటు చేయబోతున్నట్టు ఆ పార్టీ కన్వీనర్ డాక్టర్ టంగుటూరి విజయకుమార్ తెలిపారు.

ఉదయం 10 గంటలకు మంగళవారం సభ కార్యక్రమం ప్రారంభం అవుతున్నట్టు ప్రకటించారు. బిజెపి అభ్యర్థి అందె బాబయ్య గెలుపు కోసం బిజెపి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున శ్రమిస్తున్నాయి. బాబయ్య పార్టీలో అందరి మద్దతుతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. అందరి మద్దతును కూడగట్టి ఎన్నికల్లో గెలుపొందేందుకు తన శాయ శక్తులా కృషి చేస్తున్నారు. ఇప్పటికే అనేక గ్రామాలు ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఆయన కుటుంబ సభ్యులతో సహా అందరూ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. బిజెపి అభ్యర్థి ప్రచారం కోసం కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పట్టణంలో ప్రచారం నిర్వహిస్తుండడం విశేషం. రేపు ఈటల రాజేందర్ సభ విజయవంతం అయితే బాబాయ్యకు పరిస్థితులు మరింత అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ముదిరాజుల ఆత్మ గౌరవం కోసం జరుగుతున్న ఈ పోరాటంలో బాబయ్య గెలుపు అనివార్యం కావాలని అందుకే ఆయన గెలుపు కోసం ఈటల రాజేందర్ పెద్ద ఎత్తున శ్రమిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement