Sunday, May 5, 2024

ఉత్సాహ భరితంగా..పూర్వవిద్యార్థుల సమ్మేళనం..

నల్గొండ జిల్లా పడమటిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం హైదరాబాద్, కర్మాన్ ఘాట్ లోని లక్ష్మి కన్వెన్షన్ హాల్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో గత 25 సంవరాలుగా ఆ పాఠశాలలో చదువుకొని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న పూర్వ విద్యార్థులు, పూర్వ, ప్రస్తుత అధ్యాపకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి, స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు పూర్వ విద్యార్థుల సంఘం నుండి సన్మానం చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ… తమకు విద్యా బుద్ధులు నేర్పిన అధ్యాపకులకు, తమ చిన్ననాటి దోస్తులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అందరం ఇలా కలుసుకోవడం కోసం నిర్వహణ బాధ్యతలు చెప్పటిన పూర్వ విద్యార్థులు వెంకట్ సూరేపల్లి, కాటం ఎల్లయ్య గౌడ్, వెంకటేశ్వర్ రావు, గందే వెంకటేశ్వర్లు, యాదగిరి రావు, వారి మిత్ర బృందాన్ని అభినందించారు. పాఠశాల అభివృద్ధికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ, ప్రస్తుత ఉపాధ్యాయులు పల్లె వెంకటరెడ్డి, ఉస్మాన్, తిరుపతి రావు, నారాయణరెడ్డి, ఆల్వాల్ రెడ్డి, జ్యోష్ణ, జాన్సీ,రగువీరా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారీగా పూర్వ విద్యార్థులు హాజరు కావడం ఆనందంగా ఉందని నిర్వాహకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement