Sunday, April 28, 2024

HYD: డ్రగ్స్ మాఫియాపై ఉక్కు పాదం మోపాలి : ఎమ్మెల్యే రఘునందన్ రావు

హైదరాబాద్ తూర్పు ప్రతినిధి, ఆగస్టు 25 : డ్రగ్స్ మాఫియాపై ఉక్కు పాదం మోపాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ అన్నారు. రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి సేవ్ ఎల్బీనగర్ పేరిట రెండు రోజుల నుండి నిర్వహిస్తున్న 48 గంటల నిరవధిక దీక్షా శిబిరానికి రఘునందన్ రావు విచ్చేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ… డ్రగ్స్, గంజారహిత తెలంగాణ కోసం ఉద్యమించాల్సి రావడం దురదృష్టకరమన్నారు.

ఎల్బీనగర్ లో మైనర్ గిరిజన బాలికపై గంజాయి మత్తులో సామూహిక అత్యాచారం చేసిన నేరస్తులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేతల ప్రభుత్వం కాదని మండిపడ్డారు. ఎంతో చేశామని గొప్పగా చెప్పుకునే ప్రభుత్వం వరుసగా దుర్ఘటనలు జరుగుతున్నా కఠినంగా వ్యవహరించకపోవడం సిగ్గుచేటన్నారు. మొన్న ఎల్బీనగర్ పోలీసులు అత్యంత దాష్టీకంగా గిరిజన మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి సమాజంలో మాయని మచ్చగా గుర్తింపు తెచ్చుకున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా సామ రంగారెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్ష వివరింపజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement