Monday, May 6, 2024

దేవునిపల్లి గ్రామానికి బస్సును నడపండి..

షాద్‌నగర్‌, (ప్రభన్యూస్‌) : భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ ఐ) ఆధ్వర్యంలో ఫరూక్‌ నగర్‌ మండలం దేవుని పల్లి గ్రామానికి బస్సు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ డిపో అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ విజేత కాలేజ్‌, అధ్యక్ష కార్యదర్శి కౌశిక్‌, విరేశ్‌ మాట్లాడుతూ దేవునిపల్లి గ్రామానికి దాదాపుగా 15 నెలలుగా బస్సులు నిలపి వేయడం జరిగిందని అన్నారు. ఈ ప్రాంతం నుంచి విద్యార్థులు కాలేజికి రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కోన్నారు. కావున‌ డిపో మేనేజర్‌ బస్సు పునః ప్రారంభం చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement