Monday, April 29, 2024

మణిపూర్​ ఘటనలపై ఆందోళన.. ప్రధాని దిష్టిబొమ్మ దహనం

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో దళితులు, గిరిజనులు, మహిళలపై దాడులు పెరిగాయని మేడ్చల్​ మల్కాజ్​గిరి జిల్లా కుత్బుల్లాపూర్​లో ఇవ్వాల (శనివారం) ఆందోళన నిర్వహించారు. సీపీఐ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. నియోజకవర్గ కార్యదర్శి ఉమా, సీనియర్ నాయకుడు ఏసురత్నం, మహిళ సమాఖ్య కార్యదర్శి హైమావతి పాల్గొన్నారు.

బీజేపీకి మద్దతు ఇచ్చే మహిళలు వారి పాలనా తీరును ఆలోచించాలని కోరారు. బీజేపీ వచ్చినప్పటి నుండి విద్వేషం పెంచడం వల్లే మనిషిని మనిషిగా చూడకుండా మతంతో చూస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో పలువురు పార్టీ కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement