Sunday, April 28, 2024

Fight for ticket : నువ్వా… నేనా..! రాజేంద్రనగర్‌లో కాంగ్రెస్‌ టికెట్‌ కు తీవ్రపోటీ

టికెట్‌ తనకేనంటున్న నరేందర్‌
ఆశలు వదులుకోని జ్ఞానేశ్వర్‌
ప్రచారంలో దూసుకుపోతున్న ‘హస్తం’ నేతలు

హైద‌రాబాద్ : రాజేంద్రనగర్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ టికెట్‌ కోసం తీవ్ర పోటీ నెలకొంది… మొత్తం 11మంది నేతలు దరకాస్తు చేసుకోగా, ఇద్దరి మధ్యలోనే ప్రధానంగా తీవ్రపోటీ ఉంది… గత రెండు పర్యాయాలు పోటీ చేసి పరాభవం పొందిన జ్ఞానేశ్వర్‌ మరోసారి తన అదృష్టం పరీక్షించుకోవాలని తహతహలాడుతున్నారు… కాగా అనూహ్యంగా మణికొండ మున్సిపల్‌ ఛైర్మన్‌ కస్తూరి నరేందర్‌ ముదిరాజ్‌ పేరు తెరపైకి వచ్చింది.. అన్ని ఇంటెలిజెన్స్‌ సర్వేలు సైతం నరేందర్‌కు జై కొట్టాయి.

దీంతో నరేందర్‌ వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. నేడో, రేపో వచ్చే రెండవ జాబితాలో తన పేరు ఉంటుందని కస్తూరి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు నేతలు పోటీపడి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో రాజేంద్రనగర్‌, మైలార్‌దేవ్‌పల్లి, అత్తాపూర్‌, శాస్త్రీపురం, సులేమాన్‌ నగర్‌ డివిజన్లతో పాటు శంషాబాద్‌, గండిపేట మండలాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. పోటాపోటీగా జరుగుతున్న ప్రచారం కార్యకర్తల్లో జోష్‌ నింపుతున్నా… ఎవరికి టికెట్‌ వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. టికెట్‌ ఎవరిని వరిస్తుందో అనే అంశంపై నియోజకవర్గ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement