Monday, May 6, 2024

AP: సూరా మునిరత్నమ్మ కుటుంబ సభ్యులను ఓదార్చిన నారా భువనేశ్వరి

రేణిగుంట, అక్టోబర్ 27 (ప్రభ న్యూస్) : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఎర్రమరెడ్డిపాలెంలోని సూరా మునిరత్నమ్మ కుటుంబ సభ్యులను ఓదార్చారు. నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా మూడవరోజు మండలంలోని ఎర్రమరెడ్డి పాలెం గ్రామంలోని సూరా ముని రత్నమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సూరా ముని రత్నమ్మ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ జాతీయ నాయకులు రవి, శ్రీధర్ వర్మ, టీడీపీ మండల అధ్యక్షుడు ముని చంద్రారెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా, ప్రముఖ న్యాయవాది ఉదయ్ కుమార్ రెడ్డి, వెంకటాపురం మాజీ ఎంపీటీసీ గజేంద్ర రెడ్డి, మండల ఎస్సీ ఎస్టీ సెల్ నాయకులు నెల్లూరు సుబ్రమణ్యం, కొరియర్ రవి, మాజీ ఎంపీటీసీ బుజ్జి నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement