Thursday, May 2, 2024

కమ్యూనిటీ హాలును పరిశీలించిన కార్పొరేటర్..

కవాడిగూడ : గాంధీనగర్‌ మున్సిపల్‌ డివిజన్‌లోని అశోక్‌నగర్లో అర్దంతరంగా నిలిచిపోయిన కమ్యూనిటీ హాలును ఎంపి సహాకారంతో పనులు పూర్తిచేసి వినియోగంలోకి తీసుకవస్తానని డివిజన్‌ కార్పోరేటర్‌ ఏ పావని వినయ్‌కుమార్‌ అన్నారు. జిహెచ్‌ఎంసి అధికారులతో కలిసి పర్యటించి కమ్యూనిటీ హాలును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అప్పటీ కేంద్రమంత్రి బంగారు దత్తాత్రేయ నిధులతో పనులు ప్రారంభించారని, నిధులు సరిపోకపోవడంతో పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయని ఆమె వెల్లడించారు. 48 లక్షలతో జిఫ్లస్‌ వన్‌ అంతస్తులు నిర్మించారని, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నిధులతో మరో అంతస్తు నిర్మాణంతో పాటు పనులు పూర్తి చేయిస్తమని ఆమె అన్నారు. కమ్యూనిటీ హాలు నిర్మాణం పూర్తి అయితే ప్రజలకు ఎంతో అనుకూలంగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు వినయ్‌కుమార్‌, ఉమేష్‌, నాగలక్ష్మి, ఆనందరావు, సాయి, అసోసియేషన్‌ నేతలు రామ్మూర్తి తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement