Friday, April 19, 2024

సీఎం భూటకపు నినాదం..

కవాడిగూడ : తన మరణానికి ముఖ్యమంత్రి కెసిఆర్‌ కారణమంటూ సునిల్‌ ఇచ్చిన మరణ వాంగ్మూలాన్ని పరిగణంలోకి తీసుకోని అందుకు బాధ్యతవహించి తక్షణమే సిఎం పదవికీ కెసిఆర్‌ రాజీనామా చేయాలని బి సి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా విద్యానగర్‌లోని బిసి భ వన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసిఆర్‌ సచ్చుడో…. తెలంగాణ వచ్చుడో అనే భూటకపు నినాదంతో విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణ వస్తే నిరుద్యోగం ఉండదని చెప్పి ఓయు, కెయుతో సహా అన్ని యూనివర్సిటీల విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించారని ఆయన అన్నారు. అనేక మంది విద్యాధికులు, నిరుద్యోగులు, విద్యార్థుల అమరత్వంతో వచ్చిన తెలంగాణ కెసిఆర్‌ కుటుంబానికి మాత్రం ఉపయోగపడిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement