Thursday, May 2, 2024

ఎమ్మెల్యేకి ప్రాగ టూల్స్ కాలనీ వాసులు ధన్యవాదాలు..

హైద‌రాబాద్ – ప్రాగ టూల్స్ కాలనీ బల్క్ కనెక్షన్ సమస్యపై ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అసెంబ్లీలో ప్రస్తావించిన సందర్భంగా ఈరోజు కాలనీ వాసులు ఎమ్మెల్యేని ఆయ‌న నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఉన్న బల్క్ కనెక్షన్ సమస్యకు ప్రభుత్వం త్వరలోనే పరిష్కారం చూపుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలని వాసులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేకి బాలనగర్ మైక్రో స్మాల్ ఇండస్ట్రిస్ అసోసియేషన్ కృతజ్ఞతలు
బాలనగర్ మైక్రో స్మాల్ ఇండస్ట్రిస్ అసోసియేషన్ స్థలం కేటాయింపు విషయమై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అసెంబ్లీలో ప్రస్తావించిన సందర్భంగా ఈరోజు సభ్యులందరూ ఎమ్మెల్యే గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు అంబటి సునీల్ కుమార్, సభ్యులు బాలాజీ, రత్నం, సూర్యం, రాజేందర్ రెడ్డి, సతీష్, అమరేశ్వర రావు, శ్రీను, సూర్య, రమేష్, రాజు, రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement