Monday, May 6, 2024

ఆల‌యంలో నాగుపాము.. భ‌క్తుల ప్ర‌త్యేక పూజ‌లు..

చాదర్‌ఘాట్ కమల్‌నగర్‌లోని ఈదమ్మ తల్లి ఆలయంలో ఓ నాగుపాము మూడు రోజులుగా ఉంటుంది. ఈ పామును స్థానికులైన ఆదిముళ్ల కృష్ణ, బెల్లంకుమార్ లు మూడు రోజుల క్రితం గుర్తించారు. వ‌ర్షాలు కురుస్తుండ‌డంతో నివాసంకోసం ఇక్క‌డి వ‌చ్చిన‌ట్లు… తిరిగి వెళ్లిపోతుందని భావించారు. కానీ, ఆ నాగుపాము దేవాలయంలోనే ఉండిపోవడంతో స్థానికులను స‌మాచారంఅ అందించారు. ఈ విషయం తెలిసి మహిళలు ఆల‌యం వ‌ద్ద ప్ర‌త్యేక‌ పూజలు చేయడం మొదలు పెట్టారు. కమల్‌నగర్‌తో పాటు, చుట్టుపక్కల బస్తీవాసులు పామును ఆసక్తిగా తిలకిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement