Wednesday, April 24, 2024

Breaking: యూనివర్సిటీలో పరిసరాల్లో ఎలుగుబంటి సంచారం..

తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలోని యూనివర్సిటీ పరిసరాల్లో ఎలుగుబంటి సంచారం కలకలం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా చిరుతలు, పులులు జనావాసాల్లోకి సంచరిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లాలో జనావాసాల్లోకి వచ్చిన ఓ ఎలుగుబంటి హల్ చల్ చేసింది. శాతవాహన యూనివర్సిటీలో ఎలుగు సంచారం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.

యూనివర్సిటీ గుట్టల్లో ఆవాసం ఏర్పాటు చేసుకున్న ఎలుగు బంటి అర్ధరాత్రి సమయాల్లో తిరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో వర్సిటీకి చెందిన విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు ఎలుగు అడుగు జాడలను గుర్తించే పనిలో పడ్డారు. అలాగే ఎలుగుబంటి సంచారంతో ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement