Tuesday, May 7, 2024

Breaking: స్కూల్ విద్యార్థుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ : విద్యార్థి మృతి

స్కూల్ విద్యార్థుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌ర‌గ‌డంతో.. ఘ‌ర్ష‌ణ‌లో ఓ విద్యార్థి మృతిచెందిన విషాద ఘ‌ట‌న హైద‌రాబాద్ లో చోటుచేసుకుంది. న‌గ‌రంలోని కృష్ణాన‌గ‌ర్ లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. సాయికృప స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. ప‌ర‌స్ప‌రం చేసుకున్న ఘర్షణ తీవ్ర స్థాయికి చేరడంతో మన్సూర్ అనే పదవ తరగతి విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థిని ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా చ‌నిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement