Friday, April 26, 2024

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం : ఉప్పల శ్రీనివాస్ గుప్తా

ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి పేద‌ల‌కు వ‌ర‌మ‌ని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా అన్నారు. హైదరాబాద్ నాగోల్ లోని తన క్యాంప్ కార్యాలయంలో న్యూ మారుతి నగర్ కొత్తపేట సరూర్నగర్ హైదరాబాద్ నివాసి, పేద ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన వై.శ్రీనివాసులు, తండ్రి సత్యనారాయణ. అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.40,500ల‌ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. ఆపత్కాలంలో ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరంలా మారిందన్నారు. ఎంతో మంది నిరుపేద ప్రజలకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి నుండి సీఎంఆర్ఎఫ్‌ ద్వారా ఆర్థిక సహాయం అందుతోందన్నారు. వైద్యం చేయించుకునే ఆర్దిక స్తోమత లేని పేద ప్రజలందరూ సీఎం రిలీఫ్ ఫండ్ సేవలను వినియోగించుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement