Sunday, April 28, 2024

వీలైనంత త్వరగా సీసీ రోడ్డు పనులను పూర్తిచేయాలి… తోకల శ్రీనివాస్ రెడ్డి

రాజేంద్రనగర్, జులై 12 (ప్ర‌భ న్యూస్) : వీలైనంత త్వరగా పనులను పూర్తి చేయాలని మైలార్ దేవ్ పల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి అధికారులకు సూచించారు. మైలార్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని వినాయక్ నగర్ లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, నూతన సీసీ రోడ్డు పనులను బుధవారం కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి, జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ… సీసీ రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను పాటించాలన్నారు. రాబోవు కాలంలో కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లెవెల్స్ సరి చూసుకుంటూ, ఈ కార్యక్రమంలో ఏఈ బలవంత్ రెడ్డి, వర్క్ ఇన్ స్పెక్ట‌ర్ రాహుల్ రెడ్డి, నాయకులు శశిధర్ రెడ్డి, సాయి రాజు రాకేష్, మహేందర్ ముదిరాజ్, శ్రీకాంత్ రెడ్డి, పాండు యాదవ్, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement