Friday, April 26, 2024

కూక‌ట్ ప‌ల్లి హెచ్ డి ఎఫ్ సి ఎటిఎం వద్ద కాల్పులు – దోపిడి.. సెక్యూరిటీ గార్డ్ మృతి

హైద‌రాబాద్ – కూక‌ట్ ప‌ల్లి హెచ్ డి ఎఫ్ సి ఎటిఎం వ‌ద్ద గుర్తు తెలియని దుండ‌గులు కాల్పులు జ‌రిపి న‌గ‌దును దోచుకుపోయారు.. ఈ సంఘటనలో బుల్లెట్ గాయపడిన సెక్యూరిటీ గార్డ్ అలీ మృతి చెందాడు.. వివ‌రాల‌లోకి వెళితే నిత్యం ర‌ద్దీగా ఉంటే కూక‌ట్ ప‌ల్లిలో కాల్పులు క‌ల‌క‌లం సృష్టించింది. ఇక్క‌డి హెచ్ డి ఎఫ్ సి ఎటిఎం లో సిబ్బంది నేటి ఉద‌యం న‌గ‌దు నింపుతుండ‌గా ఇద్ద‌రు దుండ‌గ‌లు తుపాకితో కాల్పులు జ‌రిపారు.. ఈ కాల్పుల‌లో సెక్యూరిటీ గార్డ్ అలీ, మ‌రోక‌రు గాయ‌ప‌డ్డారు.. కాల్పులు జ‌రిపిన దుండ‌గులు ఆ వెంట‌నే ఎటిఎం చెస్ట్ లో ఉన్న క్యాష్ ను దోచుకెళ్లారు.. ఆ వెంట‌నే మెరుపు వేగంతో దుండ‌గులు ప‌రార‌య్యారు.. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు.. గాయ‌ప‌డిన వారిని చికిత్స కోసం హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లించారు.. చికిత్స పొందుతూ అలీ మరణించాడు..

Advertisement

తాజా వార్తలు

Advertisement