Saturday, April 20, 2024

ప్రజలను మోసం చేయొద్దు…

మెట్‌పల్లి: టిఆర్‌ఎస్‌ నాయకులు తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేయడం ఇప్పటికైనా మానుకోవాలని కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు మహ్మద్‌ కుత్ బుద్దీన్ పాషా పేర్కొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరోనా సాకుతో ప్రజలకు అందాల్సిన సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడంలో జాప్యం జరుగుతోందని ప్రశ్నిస్తే టిఆర్‌ఎస్‌ నాయకులు విచక్షణ కోల్పోయి మాట్లాడడం సరికాదన్నారు. తాను ఎక్కడ తప్పుడు ప్రచారం చేయలేదని, ప్రస్తుత వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నానన్నారు. ఇది తెలియని కొందరు టిఆర్‌ఎస్‌ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతుండడం వారి విచక్షణకే వదిలేస్తున్నానన్నారు. ప్రజలు ఎన్నుకున్న నాయకులు ప్రజలకు అందుబాటు-లో లేకుండా ఏవేవో సాకులు చెప్పడం పద్ధతి కాదని, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌, టిఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి మార్గం గంగాధర్‌కు నన్ను విమర్శించే స్థాయి లేదన్నారు. అతను ఏ స్థాయి నుంచి వచ్చాడో అందరికీ తెలిసిన విషయమేనని, సినిమా థియేటర్‌ ల వద్ద బ్లాక్‌ టికెట్లు- అమ్ముకున్న వ్యక్తి నిరంతరం ప్రజా సమస్యలపై గళమెత్తిన నాపై ఇష్టం వచ్చినట్లు- మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడేది కాదని, ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు. పిచ్చి పిచ్చి కూతలు మానుకోవాలని, లేనిపక్షంలో తగిన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement