Tuesday, May 21, 2024

షాహీన్‌నగర్‌లో దారుణం.. వ్యక్తి దారుణ హత్య..

షాహీన్ గ‌న‌ర్ లో దారుణం చోటుచేసుకుంది. కారు విక్రయానికి సంబంధించిన డ‌బ్బులు ఎంత‌కీ ఇవ్వ‌కుండా అత‌ని చుట్టూ తిప్పించుకుంటున్నాడ‌ని కోపంతో ఓ వ్యక్తిని రాడ్డుతో కొట్టి చంపేశాడు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. షాహీన్‌నగర్‌కు చెందిన మహమ్మద్‌ అక్బర్‌ (37), కొన్ని నెల‌ల కింద‌ట అబ్దుల్‌ రెహ్మాన్‌ ఖాద్రి వద్ద కారు కొనుగోలు చేశాడు. దీని మొత్తం రూ.2.5 లక్షలు ఇవ్వాల్సి ఉండగా ఎంత‌కీ ఇవ్వ‌కుండా ఖాద్రిని ప్ర‌తి రోజు ఇంటికి తిప్పుతున్నాడు. దీంతో స‌హ‌నం కోల్పోయిన ఖాద్రి ఆదివారం రాత్రి అక్బర్‌ ఇంటికి వచ్చిన ఆగ్రహంతో అక్బర్‌ తలపై రాడ్డుతో తీవ్రంగా కొట్టాడు. అక్బర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement