Wednesday, May 1, 2024

HYD: చేసిన అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్, నవంబర్ 18 (ప్రభ న్యూస్) : ఎల్బీనగర్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ఈ ఎన్నికల్లో ఆశీర్వదించాలని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కోరారు. బి.ఏన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సచివాలయనగర్ శ్రీ కన్వెన్షన్ లో వైదేహినగర్ నార్త్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, వైదేహినగర్, విజయపురి కాలనీ సంక్షేమ సంఘం, విజయపురి ఫేస్- 2 కాలనీ సంక్షేమ సంఘాల ఆత్మీయ సమావేశం చైతన్యనగర్ కాలనీలో రోడ్డు షో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ… గత అయిదు సంవత్సరాల్లో తాను చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు మళ్ళీ తనను గెలుపిస్తాయన్నారు. అలాగే రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి.ఏన్.రెడ్డి.నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న, గడ్డి అన్నారం మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనిల్ చౌదరి, సామ బుచ్చిరెడ్డి, ముద్ద గౌనిసుమన్ గౌడ్, పొగుల రాంబాబు, జగన్ మోహన్, రాఘవేంద్రరావు, అరుణ్, నాయకులు, పలు కాలనీల అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement