Friday, April 26, 2024

వాస్తవాల ప్రచురణలో “ఆంధ్రప్రభ” భేష్ : కె.న‌రేంద‌ర్ రెడ్డి

వాస్తవాలను ప్రచురించడంలో ఆంధ్రప్రభ ముందువరుసలో ఉంటున్నదని మణికొండ మున్సిపాలిటీ వైస్ ఛైర్మెన్ కే న‌రేంద‌ర్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రభ 2022 క్యాలెండర్ ను ఈరోజు శ్రీ పార్వతి రామలింగేశ్వ‌ర‌ స్వామి టెంపుల్ లో ఆవిష్కరించి, అనంత‌రం న‌రేంద‌ర్ రెడ్డి మాట్లాడారు. అందరి మన్ననలు పొందేలా ఆంధ్రప్రభ వార్తలను పాఠకులకు చేరవేస్తోందని కితాబిచ్చారు. భవిష్యత్తులోనూ ఇదే ఒరవడితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గండిపేట మండల రిపోర్ట‌ర్ విజయ్ కుమార్ గంటా, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement